రాష్ట్రంలోని మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఛైర్మన్ల నియామకంపై బుధవారం నాడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా రావుల శ్రీధర్ రెడ్డిని నియమించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గా మెట్టు శ్రీనివాస్ ను, అలాగే రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఏళ్ల పాటుగా వీరు చైర్మన్ పదవుల్లో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో రావుల శ్రీధర్ రెడ్డి, మెట్టు శ్రీనివాస్ లు బుధవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ