బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాతబస్తీలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పలు ఆంక్షలను విధించారు. ఓల్డ్ సిటీకి వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీతో పాటు సౌత్ జోన్లో ఈ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈ మార్గాల్లో ప్రయాణించాల్సిన వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. దీని ప్రకారం..
- పురానాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి, చాదర్ఘాట్ బ్రిడ్జి, చాదర్ఘాట్ కాజ్వే, ముసారాంబాగ్ బ్రిడ్జి నుంచి ఓల్డ్ సిటీ, మలక్పేట్, ఎల్బీనగర్ వైపు వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి.
- ఎంజే మార్కెట్ నుంచి ఎంజే బ్రిడ్జి, పురానాపూల్ బ్రిడ్జి మీదుగా ఓల్డ్ సిటీ వైపు వచ్చే ట్రాఫిక్ను 100 అడుగుల రోడ్డు, జియాగూడ, రాంసింగ్పురా, అత్తాపూర్, ఆరామ్గఢ్, మైలార్దేవ్పల్లి, చాంద్రాయణగుట్ట వైపు మళ్లిస్తారు.
- అలాగే ఎంజే మార్కెట్ నుంచి నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి మీదుగా ఓల్డ్ సిటీకి చేరుకునే వారు.. రంగమహల్, చాదర్ఘాట్, నింబోలిఅడ్డ, టూరిస్ట్ జంక్షన్, బర్కత్పురా, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, తార్నాక మీదుగా అనుమతించబడతారు.
- అబిడ్స్, కోటి వైపు నుంచి చాదర్ఘాట్ వంతెన, చాదర్ఘాట్ కాజ్ వే, మూసారాంబాగ్ వంతెన మీదుగా మలక్పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ వైపు వెళ్లే వారు నింబోలిఅడ్డ, టూరిస్ట్ జంక్షన్, బర్కత్పురా, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, తార్నాక, రామంతాపూర్ మీదుగా చేరుకోవాలి.
- దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ నుంచి అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్ వెళ్లే వాహనదారులు.. ఉప్పల్, తార్నాక, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్పురా మీదుగా ప్రయాణించొచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY