తెలంగాణలో రాష్ట్రంలో 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చారిత్రక గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు జాతీయజెండాను ఆవిష్కరించారు. గోల్కొండ కోట వద్దకు చేరుకునే ముందు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని, అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళర్పించారు. అక్కడి నుంచి గోల్కొండ కోటకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా దాదాపు 1000 మంది కళాకారులు స్వాగతం పలుకుతూ ప్రదర్శనలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ 76వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY