తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ముందుగా కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో కూడా సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాంబర్ లోని కుర్చీలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంకను సీఎం కేసీఆర్ కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజయ్య, శంకర్నాయక్ సహా మహబూబాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
ఈ పర్యటనలో ముందుగా ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి సీఎం కేసీఆర్ మానుకోటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మానుకోటలో కొత్తగా నిర్మించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ జిల్లా కార్యాలయ నూతన భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ఆఫీసు ప్రాంగణంలో సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆఫీసు లోపల సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవితను సీఎం కేసీఆర్ జిల్లా అధ్యక్ష సీట్లో బెట్టి, శుభాకాంక్షలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE