ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 11, సోమవారం ఉదయానికి కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 2018 కు చేరింది. అలాగే కృష్ణా జిల్లాలో 342 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లా పరిధిలోని నూజివీడులో కొత్తగా మరో కేసు నమోదైంది. స్థానిక మైలవరం రోడ్డుకు చెందిన మహిళకు ముందుగా ట్రూనాట్ కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్ రాగా, ఆమె శాంపుల్స్ని విజయవాడ పంపారు, అక్కడ కూడా ఆమెకు పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో ముందు జాగ్రత చర్యల్లో భాగంగా నూజివీడు పట్టణంలో మే 11 నుంచి జూన్ 8 వరకు అనగా 28 రోజుల పాటు లాక్డౌన్ ను కొనసాగించనున్నట్లు తహశీల్దారు ఎం.సురేష్కుమార్ తెలిపారు.
రెడ్ జోన్ ప్రాంతం మినహా పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో కూరగాయలు, నిత్యావసర సరకుల దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరవాలని ఆదేశాలిచ్చారు. ఇంతకు ముందే నూజివీడు మండలాన్ని కరోనా ప్రభావిత మండలంగా ప్రభుత్వం ప్రకటించింది. నాలుగు కేసులు కంటే ఎక్కువుగా ఉన్న మండలాలను కరోనా ప్రభావిత మండలాలుగా ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu