తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (ఫిబ్రవరి 23, బుధవారం) మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-4లో భాగంగా రూ.6,805 కోట్ల వ్యయంతో మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ రిజర్వాయరే అతిపెద్దది. ఇది 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించబడింది. సిద్దిపేట జిల్లాలోని తొగుట, కొండపాక మండలాల సరిహద్దుల్లో దీన్ని నిర్మించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా సుమారు 8.33 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటుగా, మరో 7,37,250 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది.
రంగనాయకసాగర్ నుంచి తుక్కాపూర్ పంపుహౌస్కు చేరిన జలాలను మల్లన్నసాగర్ రిజర్వాయర్లోకి తరలించనున్నారు. మల్లన్నసాగర్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం రిజర్వాయర్ వద్దే నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం వారం నాడు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అధికారులుతో కలిసి పరిశీలించి, కీలక సూచనలు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ