అసెంబ్లీ ఎన్నికలవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్లోని డీఏవీ స్కూల్లో కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత పోలింగ్ బూత్ నుంచి బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు. ఈక్రమంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఓటర్లకు కవిత విజ్ఞప్తి చేశారు. అయితే పోలింగ్ వేళ.. తమకే ఓటు వేయాలని ఓటర్లను కవిత కోరడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అటు ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పోలింగ్ బూత్ వద్ద.. తమకే ఓటు వేయాలని ఓటర్లను కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఛైర్మన్ నిరంజన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ను కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE