తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా యాదాద్రికి చేరుకొని, వీవీఐపీల విడిది కోసం నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ను ప్రారంభించనున్నారు. అలాగే యాదాద్రిలో యాగశాల నిర్వహణ స్థలాన్ని కూడా సీఎం పరిశీలించనున్నారు. అనంతరం భువనగిరిలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష జరుపనున్నారు. ఇక మధ్యాహ్నం భువనగిరిలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ నూతన భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు. అనంతరం రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ