తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యాదాద్రిలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ దంపతులు యాదాద్రి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం కోసం స్వామివారికి కుటుంబం తరపున కిలో 16 తులాల బంగారం సమర్పించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాలయం వద్ద ‘కళావేదిక’కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అలాగే ఆలయంలో నిర్మాణం జరుపుకుంటున్న పనుల పురోగతిని పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోవైపు విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5న సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన చేపట్టడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY