తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1896 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 10, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 82,647 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 645 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.78% (< 1%) శాతంగా ఉంది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1788 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 59,374 కి చేరింది. ప్రస్తుతం 22,628 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 71.84 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 338, రంగారెడ్డి జిల్లాలో 147, కరీంనగర్ లో 121, మేడ్చల్ లో 119, వరంగల్ అర్బన్ లో 95, జోగులాంబ గద్వాల లో 85, కామారెడ్డిలో 71, జనగామలో 71, పెద్దపల్లిలో 66, ఖమ్మంలో 65, సిద్ధిపేటలో 64, భద్రాద్రి కొత్తగూడెంలో 60, జగిత్యాలలో 59, మహబూబ్ నగర్ లో 58, నల్గొండలో 54, సంగారెడ్డిలో 49, నిజామాబాద్ లో 42, రాజన్న సిరిసిల్లలో 38, వరంగల్ రూరల్ లో 35, సూర్యాపేటలో 32 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu