సీఎంలతో నేడు పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, కరోనా పరిస్థితిపై కీలక చర్చ?

PM Modi, PM Modi Video Conference, PM Modi Video Conference News, PM Modi Video Conference to Discuss Corona situation, PM Modi Video Conference with Chief Ministers, PM Modi Video Conference with CMs, PM Modi Video Conference with CMs of 10 States, Prime Minister

దేశంలో ఆగస్టు 11, మంగళవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,68,675 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం, కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు వైద్యం అందుతున్న తీరు, తదితర అంశాలపై చర్చించేందుకు ఈ రోజు 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పంజాబ్, బీహార్, గుజరాత్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వైద్యశాఖ మంత్రి హర్షవర్దన్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా పాల్గొననున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం మొదలయ్యాక సీఎంలతో ప్రధాని మోదీ ఏడోసారి భేటీ కానున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =