తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 2256 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 7, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 77,513 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 23,322 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 464, వరంగల్ అర్బన్ జిల్లాలో 187, రంగారెడ్డిలో 181, మేడ్చల్ లో 138, కరీంనగర్ లో 101, జోగులాంబ గద్వాల్ లో 95, సంగారెడ్డిలో 92, పెద్దపల్లిలో 84, భద్రాద్రి కొత్తగూడెంలో 79, రాజన్న సిరిసిల్లలో 78, కామారెడ్డిలో 76, నిజామాబాద్ లో 74, ఖమ్మంలో 69, సిద్దిపేట లో 63, నల్గొండలో 61, జగిత్యాలలో 49, మహబూబ్ నగర్ లో 45, మంచిర్యాలలో 44, జయశంకర్ భూపాలపల్లి లో 38, ఆదిలాబాద్ లో 26, సూర్యాపేటలో 25, యాదాద్రి భువనగిరిలో 24, మహబూబాబాద్ లో 23, ములుగులో 20, వనపర్తిలో 19, నిర్మల్ లో 18, జనగామలో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 7, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 5,90,306
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 77,513
- కొత్తగా నమోదైన కేసులు : 2256
- నమోదైన మరణాలు : 14
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 54,330
- కరోనా రికవరీ రేటు: 70.09%
- యాక్టీవ్ కేసులు : 22,568
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 15,830
- మొత్తం మరణాల సంఖ్య : 615
- కరోనా మరణాల రేటు: 0.79%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu