తెలంగాణ రాష్ట్రంలో మరో 574 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 23, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,83,556 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన ఇద్దరు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1524 కి పెరిగినట్టు తెలిపారు. కాగా మరణాల రేటు 0.53 శాతంగా ఉంది.
కరోనా నుంచి కొత్తగా 384 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,75,217 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 97.05 శాతంగా ఉంది. ఇక ప్రస్తుతం 6,815 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 109, రంగారెడ్డిలో 48, మేడ్చల్ లో 42, వరంగల్ అర్బన్ లో 34, కరీంనగర్ లో 30, ఖమ్మంలో 25, సంగారెడ్డిలో 24, భద్రాద్రి కొత్తగూడెంలో 22, నల్గొండలో 22 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ