కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం నల్లగొండ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వ్యవహారంపై గుత్తా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, ఆయన కుటుంబంలో ఎంతమంది కాంగ్రెస్ పార్టీ తరపున పదవులు పొందారో అందరికీ తెలుసునని అన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా బీజేపీకి అవసరం అని, మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయనకు పరాభవం తప్పదని పేర్కొన్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసమే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, కానీ పైకి మాత్రం మునుగోడు అభివృద్ధి కోసమే అని చెప్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని.. కాంగ్రెస్, బీజేపీలతో రాష్ట్రానికి తీరని నష్టం కలుగుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY