రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల్లో కరోనా పరిస్థితులు, టెస్టులు, పాజిటివ్ రేటు, ఆసుపత్రులలో బెడ్ల ఆక్యుపెన్సీలపై జిల్లా కలెక్టర్లు, , డీఎంహెఛ్ఓలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల సూపరిండెంట్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా జిల్లాలలో నెలకొన్న కరోనా పరిస్ధితులను సీఎస్ సమీక్షించి, కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాలు, గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అలాగే ఆ ప్రాంతాల్లో కరోనా నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. సరిహద్దు గ్రామాలపై కూడా దృష్టి సారించి నివారణ చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జీ.శ్రీనివాస్ రావు, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి డా.గంగాధర్ లు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ