కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినేట్ కార్యదర్శికి వివరించారు. మే 28, గురువారం నాడు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కోవిడ్-19 కు సంబంధించి ప్రజారోగ్య స్పందనపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్స్ లలో తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వైరస్ నియంత్రణలోనే ఉందని, రాష్ట్రానికి సరిపడ పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్కులు, టెస్టింగ్ కిట్స్, బెడ్స్, వెంటిలేటర్లు సమకూర్చుకున్నామని చెప్పారు. కోవిడ్ చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, 1 లక్ష కేసులకు చికిత్స అందించే విధంగా సిద్ధంగా ఉన్నామని కేంద్ర కేబినెట్ కార్యదర్శికి సీఎస్ వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, సీసీఎల్ఏ డైరెక్టర్ రజత్ కుమార్ షైనీ, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu