మహిళలు, సినీ తారలు, రాజకీయ నాయకులను ట్రోల్ చేస్తున్న పలువురు సోషల్ మీడియా బ్లాగర్లకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా బుధవారం సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలు చేసే రాజకీయ నేతలపైనా, మహిళలపైనా అసభ్యకర పోస్టులు పెట్టడం, మీమ్స్, ట్రోల్స్ వంటివి చేయడం సహా ఫొటో మార్ఫింగ్ వంటివి ఎట్టి పరిస్థిల్లోనూ సహించేది లేదన్నారు. పరిధి దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులపై ట్రోలింగ్ చేసిన 20 మందికి నోటీసులు ఇచ్చామని, వీరిలో 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ఇక కొందరు సెలబ్రెటీల వీడియోలను మార్ఫింగ్ చేస్తున్నారని, అయితే ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేయడం చట్టరీత్యా నేరం అని డీసీపీ మెహ్రా స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులపై ట్రోలింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు, మహిళలను కించిపరిచేలా ఎలాంటి వీడియోలు, పోస్టింగులు పెట్టినా చట్ట ప్రకారం శిక్షార్హతకు గురవుతారని తెలిపారు. కాగా ఇటీవల ఎమ్మెల్సీ కవితపై ఎక్కువగా ట్రోలింగ్ జరిగిన నేపథ్యంలో పోలీసులు దీనిపై దృష్టి సారించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE