తెలంగాణ రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అన్ని పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ముందుగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో 2020-21 బ్యాచ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతికి ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికీ పరీక్షలు నిర్వహించేందుకు తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. కాగా 70 శాతం సిలబస్ నుంచే పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అన్ని కరోనా నిబంధనలను పాటిస్తూ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ థియరీ పరీక్షల షెడ్యూల్:
- అక్టోబర్ 25: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
- అక్టోబర్ 26: ఇంగ్లీష్ పేపర్-1
- అక్టోబర్ 27: మ్యాథమేటిక్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
- అక్టోబర్ 28: మ్యాథమేటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
- అక్టోబర్ 29: ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
- అక్టోబర్ 30: కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
- నవంబర్ 1: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపిసి విద్యార్థులకు)
- నవంబర్ 2: మోడరన్ లాంగ్వేజ్ పేపర్-1 మరియు జాగ్రఫీ పేపర్-1.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ