గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అమలు చేస్తున్న వినూత్న పథకాలు, వాటి ప్రదర్శనకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్)-2023లో మొదటి బహుమతి లభించింది. నుమాయిష్ ఎగ్జిబిషన్-2023 ముగింపు వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా అటవీశాఖ అధికారులు ఈ బహుమతిని అందుకున్నారు. ప్రభుత్వ శాఖలు, పథకాల అమలు ప్రదర్శన, మంచి అలంకరణ విభాగంలో తెలంగాణ అటవీశాఖ ఏర్పాటు చేసిన స్టాల్ కు ఈ బహుమతి దక్కింది.
ప్రతీయేటా జరిగే ఎగ్జిబిషన్ లో తెలంగాణ అటవీశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రదర్శన, మినీ జూతో కూడిన స్టాల్ ను ఏర్పాటు చేస్తుంది. ఈసారి అడవి, వన్యప్రాణుల థీమ్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ ప్రదర్శన సందర్శకులు అందరినీ బాగా ఆకట్టుకుంది. ఈఏడాది కూడా సమర్థవంతగా స్టాల్ ను నిర్వహించి బహుమతి గెలుచుకున్న అధికారులు, సిబ్బందిని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్, ముఖ్యమంత్రి ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్ అభినందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE