ఐదు రోజుల శీతాకాల విడిది కోసం హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శంషాబాద్ ఎయిర్పోర్టులో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరియు తెలంగాణ మంత్రి మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము శంషాబాద్ నుంచే నేరుగా ప్రత్యేక విమానంలో ఏపీలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆమె వెంట గవర్నర్ తమిళిసై మరియు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు కూడా పయనమయ్యారు. కాగా ద్రౌపది ముర్ము నేటి నుంచి 30వ తేదీ వరకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో విడిది చేయనున్నారు. ఈ మేరకు అధికారులు రాష్ట్రపతి భవన్లో అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోని అన్ని భవనాలను, ఆవరణలోని పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే నగరంలో ఈరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ