తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీ.పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఎన్నికల కమిషనర్ గా పార్థసారథి మూడేళ్ళ పాటు పదవిలో కొనసాగనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి ఎన్నికల కమిషనర్గా నాగిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. గత ఏప్రిల్తో నాగిరెడ్డి ఐదేళ్ల పదవీకాలం పూర్తయింది. కొన్ని నెలల్లో జీహెఛ్ఎంసీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పార్థసారథిని నూతన ఎలక్షన్ కమిషనర్ గా నియమించినట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రగతి భవన్ లో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను పార్థసారథి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu