తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా పార్థ‌సార‌థి నియామ‌కం

C Parthasarathi, C Parthasarathi As New State Election Commissioner, C Parthasarathi Election Commissioner, Telangana Election Commissioner, Telangana Govt Appointed C Parthasarathi As New State Election Commissioner, Telangana New Election Commissioner, Telangana New State Election Commissioner, Telangana State Election Commission, Telangana State Election Commissioner

తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీ.పార్థ‌సార‌థి నియమితులయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయగా, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఎన్నికల కమిషనర్ గా పార్థసారథి మూడేళ్ళ పాటు పదవిలో కొనసాగనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి ఎన్నికల కమిషనర్‌గా నాగిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. గత ఏప్రిల్‌తో నాగిరెడ్డి ఐదేళ్ల పదవీకాలం పూర్తయింది. కొన్ని నెలల్లో జీహెఛ్ఎంసీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్ర‌భుత్వం పార్థ‌సార‌థిని నూతన ఎలక్షన్ క‌మిష‌న‌ర్ ‌గా నియమించినట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రగతి భవన్ లో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను పార్థ‌సార‌థి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =