రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు/నర్సింగ్ హోమ్స్ లలో కరోనా చికిత్సలు మరియు ప్రైవేటు ల్యాబోరేటరీలలో కరోనాకు సంబంధించిన డయాగ్నోస్టిక్ పరీక్షల గరిష్ఠ ధరలను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఈ ధరలను అమలు చేయాలని, లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు కరోనా చికిత్స, పరీక్షల ధరలపై రాష్ట్ర వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ జీవో 401 తో ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స, పరీక్షలకు ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలు:
- సాధారణ వార్డు + ఐసొలేషన్ వార్డులో అడ్మిషన్: రూ.4,000 (రోజుకు)
- ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ లేకుండా చికిత్స + ఐసొలేషన్ – రూ.7,500 (రోజుకు)
- ఐసీయూలో ఉంచి వెంటిలేటర్పై చికిత్స + ఐసొలేషన్ – రూ.9,000 (రోజుకు)
- పీపీఈ కిట్స్ – రూ.273 (ఒక్కో కిట్ కు)
- హెచ్ఆర్ సీటీ – రూ.1995
- ఐఎల్6 – రూ.1300
- డిజిటల్ ఎక్స్ రే – రూ.300
- డీడైమర్ – రూ.800
- సీఆర్పీ – రూ.500
- ప్రొకాల్సీతోసిన్ – రూ.1400
- ఫెరిటీన్ – రూ.400
- ఎల్డీహెచ్ – రూ.140
- బేసిక్ లైఫ్ సపోర్టింగ్ సిస్టం అంబులెన్స్ – కిలోమీటరుకు రూ.75, కనీసం ధర రూ.2 వేలు
- అడ్వాన్సుడ్ లైఫ్ సపోర్టింగ్ సిస్టం అంబులెన్స్ – కిలోమీటరుకు రూ.125, కనీసం ధర రూ.3 వేలు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ