ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్, డిజిటల్ లైబ్రరీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ముఖ్యఉద్దేశమని అన్నారు. భవిష్యత్ లో ఉద్యోగాల కల్పనకు విశాఖపట్నం నగరం ప్రధాన కేంద్రమవుతుందన్నారు. అలాగే విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలలో కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వర్క్ఫ్రం హోం కాన్సెప్ట్ను బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఏపీలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏటా ఇన్సెంటివ్లు చెల్లిస్తామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ