లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్, మే నెలలకు ఇంటి కిరాయిదారులను యజమానులు ఇబ్బంది పెట్టొద్దని, ఆ తర్వాత వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం ఇవ్వాలి, మరియు వడ్డీ వసూలు చేయకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్చి నుంచి 3 నెలల వరకు యజమానులు ఇంటి అద్దెలు వసూలు చేయరాదని తెలంగాణ పురపాలక శాఖ ఏప్రిల్ 23, గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. మూడు నెలల అనంతరం అద్దె బకాయిలను వాయిదాల పద్దతిలో తీసుకోవాలని, వడ్డీ కూడా అడగకూడదని ఇంటి యజమానులను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
అద్దెలు చెల్లించాలని, ఇల్లు ఖాళీ చేయాలని వేధిస్తూ, ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై అంటువ్యాధుల నిరోధక చట్టం- 1897, విపత్తు నిర్వహణ చట్టం- 2005 కింద కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తాత్కాలిక, శాశ్వత, సగం శాశ్వత కట్టడాలను అద్దెకు ఇచ్చిన వారికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని చెప్పారు. జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్, మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లకు ఈ ఉత్తర్వులకు సంబంధిన అధికారాలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]