టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు

Telangana Govt Forms Special Team To Investigate The Moinabad Farm House Case,Special Team To Investigate MLA's Poaching case,Moinabad Farm House Case,Telangana Govt Special Team,Mango News,Mango News Telugu,,TRS MLAs Poaching Case,Telangana HC Lifts Stay on Probe,MLAs poaching case,TRS MLAs Purchasing Issue, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీనికి హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వం వహించనున్నారు. అలాగే ఈ బృందంలో న‌ల్ల‌గొండ ఎస్పీ రెమా రాజేశ్వ‌రి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ క‌మ‌లేశ్వ‌ర్ సింగేన‌వ‌ర్‌, శంషాబాద్ డీసీపీ ఆర్ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, నారాయ‌ణ‌పేట ఎస్పీ వెంక‌టేశ్వ‌ర్లు, రాజేంద్ర‌న‌గ‌ర్ డివిజన్ ఏసీపీ గంగాధ‌ర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డిలు స‌భ్యులుగా ఉన్నారు.

ఈ మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ హోం శాఖ కార్య‌ద‌ర్శి రవి గుప్తా బుధ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేశారు. కాగా హైదరాబాద్ శివారు మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నిస్తూ రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజి అనే మధ్యవర్తులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దర్యాప్తును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను మంగళవారం కోర్టు రద్దు చేయడంతో పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. కేసు దర్యాప్తుని వేగవంతం చేసేందుకు ‘సిట్’ ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =