రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ హౌస్ సర్జన్లు, పీజీ వైద్య, సూపర్ స్పెషాలిటీ, ఎండీఎస్ విద్యార్థుల స్టైపండ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం హౌస్ సర్జన్, పీజీ వైద్య విద్యార్థుల స్టైఫండ్ ను 15 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విద్యార్థులకు ప్రస్తుతంలో అమల్లో ఉన్న స్టైపండ్ పై 15 శాతం పెంపు జనవరి 1, 2021 నుంచి వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయగా, వైద్యారోగ్య శాఖ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్థులకు పెరిగిన స్టైపండ్ వివరాలు:
- మెడికల్, డెంటల్ హౌస్ సర్జన్లకు రూ.19,589 నుంచి రూ.22,527 పెంపు
పీజీ డిగ్రీ:
- ఫస్ట్ ఇయర్ : రూ.44,075 నుంచి రూ.50,686 పెంపు
- సెకండ్ ఇయర్ : రూ.46,524 నుంచి రూ.53,503 పెంపు
- థర్డ్ ఇయర్ : రూ.48,973 నుంచి రూ.56,319 పెంపు
పీజీ డిగ్రీ:
- ఫస్ట్ ఇయర్ : రూ.44,075 నుంచి రూ.50,686 పెంపు
- సెకండ్ ఇయర్ : రూ.46,524 నుంచి రూ.53,503 పెంపు
సూపర్ స్పెషాలిటీ:
- ఫస్ట్ ఇయర్ : రూ.48,973 నుంచి రూ.56,319 పెంపు
- సెకండ్ ఇయర్ : రూ.51,422 నుంచి రూ.59,135 పెంపు
- థర్డ్ ఇయర్ : రూ.53,869 నుంచి రూ.61,949 పెంపు
ఎండీఎస్ :
- ఫస్ట్ ఇయర్ : రూ.44,075 నుంచి రూ.50,686 పెంపు
- సెకండ్ ఇయర్ : రూ.46,524 నుంచి రూ.53,503 పెంపు
- థర్డ్ ఇయర్ : రూ.48,973 నుంచి రూ.56,319 పెంపు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ