కరోనా బారినపడి కోలుకున్న కొందరికి తర్వాతి దశలో మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) అనే వ్యాధి సోకుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో చికిత్స విషయంలో ఏపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనాకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తుండగా, బ్లాక్ ఫంగస్ వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి వైద్య సేవలు అందించాలని ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది.
బ్లాక్ ఫంగస్ చికిత్సకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది, చికిత్స ఖర్చును కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏపీలో ఇప్పటికి 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ