రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు పెంచకూడదని, ఇతర ఫీజులు లేకుండా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే నెలవారీగా వసూలు చేయాలనీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే స్కూళ్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని, స్కూల్స్ గుర్తింపు రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.75 జారీ చేసింది. రాష్ట్రంలోని స్కూళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కు ఆదేశాలిచ్చారు. ఈ జీవో రాష్ట్ర బోర్డు పరిధిలోని స్కూళ్లకు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సహా ఇంటర్నేషనల్ బోర్డులలో గుర్తింపు పొందిన స్కూళ్లకు వర్తిస్తుందని, ప్రభుత్వ ఆదేశాలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ