తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేస్తున్నాం అని పంచాయితీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలోని ఆశావర్కర్లకు శుక్రవారం కలెక్టరేట్లో స్మార్ట్ ఫోన్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో పాల్గొన్న మంత్రి దయాకర్ రావు వరంగల్ లోని 693 మందికి, హనుమకొండ లోని 616 మంది ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్ లను అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల మంది ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నామని తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలో ఆశావర్కర్ల సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు.. వారికి 4జీ సిమ్, స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్నామని మంత్రి చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ