తెలంగాణ ప్రభుత్వం ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించటానికి కృషి చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు దయాకర్ రావు తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందించటానికి అవసరమైన ప్రణాళికలను సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో విద్యాశాఖ రూపొందిస్తోంది అన్నారు.
ఈరోజు (శుక్రవారం) దేవరుప్పుల మండలం చిన్నమడూర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎర్రబెల్లి అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. అలాగే, గ్రామస్తులను కూడా కలిసి ప్రభుత్వపరంగా పాఠశాలల నిర్వహణకు సంబంధించిన అంశాలు.. విధానాలను వారికి వివరించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలలకు ప్రత్యేక నిధులు మంజూరు చేనున్నట్లు మంత్రి తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను మలచుకోవాలంటే అందరి సహకారం కావాలని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ