తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి ఖరీఫ్, రబీ సమయాల్లో ఐదువేలు లెక్కన ఒక్కో ఎకరానికి మొత్తం 10 వేలు చొప్పున అందజేస్తున్నారు. ఇందులో భాగంగా మార్చ్ 6, శుక్రవారం నాడు రైతుబంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ.333.29 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేసేందుకు వ్యవసాయశాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రైతులకు పంట పెట్టుబడి నిమిత్తం అందజేస్తున్న రైతుబంధు పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటికే రూ.1350.61 కోట్లను విడుదల చేసింది. తాజాగా మరో రూ.333.29 కోట్లును విడుదల చేయడంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ రైతు బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1683.90 కోట్లు విడుదల చేసినట్లు అయింది.
[subscribe]