ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందడి మరోసారి మొదలవనుంది. స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్కుమార్ మార్చ్ 7, శనివారం నాడు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సరైన ప్రణాళికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. ముందుగా మార్చ్ 21న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఒక విడతలో నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం మార్చ్ 23న మున్సిపల్ ఎన్నికలు కూడా ఒకే దశలో జరగనున్నాయి. ఇక మార్చ్ 27, 29వ తేదీల్లో రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్లు ఉండగా, 660 జడ్పీటీసీ, 9639 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా అన్ని జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మొత్తం 13 జిల్లాల్లో రెండు బీసీ స్థానాలతో పాటుగా మహిళలకు ఏడు స్థానాలు రిజర్వు కాగా, నాలుగు స్థానాలు జనరల్, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒక స్థానం చొప్పున రిజర్వేషన్లు ప్రకటించారు. ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీపీపీ, జెడ్పీటీసీ రిజర్వేష్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్:
- నోటిఫికేషన్ విడుదల తేదీ: మార్చ్ 7
- నామినేషన్ల దాఖలకు గడువు: మార్చ్ 9 నుంచి మార్చ్ 11 వరకు
- నామినేషన్ల పరిశీలన: మార్చ్ 12
- నామినేషన్ల ఉపసంహరణ: మార్చ్ 14
- పోలింగ్ తేదీ: మార్చ్ 21
- ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన: మార్చ్ 24
ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్:
- ఎన్నికల నోటిఫికేషన్ విడుదల : మార్చ్ 9
- నామినేషన్ల దాఖలకు గడువు: మార్చ్ 11 నుంచి మార్చ్ 13
- నామినేషన్ల పరిశీలన: మార్చ్ 14
- నామినేషన్ల ఉపసంహరణ: మార్చ్ 16
- పోలింగ్ తేదీ: మార్చ్ 23
- ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన: మార్చ్ 27
పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్:
- నోటిఫికేషన్ విడుదల: మార్చ్ 15:
- నామినేషన్ల స్వీకరణ : మార్చ్ 17-19
- నామినేషన్ల పరిశీలన : మార్చ్ 20
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది: మార్చ్ 22
- ఎన్నికల పోలింగ్ : మార్చి 27
- ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన: మార్చి 27
పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్
- నోటిఫికేషన్ విడుదల: మార్చ్ 17
- నామినేషన్ల స్వీకరణ: మార్చ్ 19-21
- నామినేషన్ల పరిశీలన: మార్చ్ 22
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది: మార్చ్ 24
- ఎన్నికల పోలింగ్: మార్చ్ 29
- ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన: మార్చ్ 29
జిల్లాల వారిగా జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు:
- అనంతపురం : బీసీ మహిళ
- చిత్తూరు : జనరల్
- కడప : జనరల్
- కర్నూలు : జనరల్
- తూర్పుగోదావరి : ఎస్సీ
- పశ్చిమ గోదావరి : బీసీ
- గుంటూరు : ఎస్సీ మహిళ
- కృష్ణా : జనరల్ మహిళ
- ప్రకాశం : జనరల్ మహిళ
- నెల్లూరు : జనరల్ మహిళ
- శ్రీకాకుళం : బీసీ మహిళ
- విశాఖపట్నం : ఎస్టీ మహిళ
- విజయనగరం : జనరల్
[subscribe]