రాష్ట్రంలో పదోతరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మే 17 నుంచి మే 26 వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తునట్టు ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ స్పెషల్ ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఎస్సీ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్ విధానం ద్వారా ఫలితాలను విడుదల చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు బోర్డు నిర్ణయించిన ప్రాతిపదికన విద్యార్థులు/విద్యార్థినిలకు కేటాయించిన మార్కులతో ఎవరైనా సంతృప్తి చెందకపొతే, వారికీ పరీక్షలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరీక్ష రాసే అవకాశం ఇవ్వబడుతుందని తెలిపారు. మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ, 12వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ