తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. ఇటీవల పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు కరోనా వైరస్ సోకింది. ‘స్వల్ప కోవిడ్ లక్షణాలు కనిపించాయి. టెస్ట్ చేయించుకున్నాను. కరోనా నిర్ధారణ కావడంతో.. ముందు జాగ్రత్తగా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరుతున్నాను. ఎలాంటి ఆందోళనలు, అపోహలు పెట్టుకోవద్దు. అతి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ వస్తాను. అలాగే, ప్రజలందరూ కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. మరోవైపు గాంధీ ఆస్ప్రత్రిలో 120 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఉస్మానియా పరిధిలో సుమారు 180 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. నీలోఫర్ ఆస్పత్రిలో 25 మందికి, అలాగే ఆదిలాబాద్ రిమ్స్లో 70 మందికి పైగా వైద్య సిబ్బందికి కరోనా సోకింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF