వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు హైకోర్టులో ఊరట లభించింది. ఆమె పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాగా సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో షర్మిల పాదయాత్ర సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జిల్లా పోలీసులు పాదయాత్రకు అనుమతి రద్దు చేశారు. దీంతో మంగళవారం వైఎస్సార్టీపీ నేత రవీంద్రనాథ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. నర్సంపేట పరిధిలోని లింగగిరి గ్రామం వద్ద అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తమ పాదయాత్రకు ఆటంకం సృష్టించారని, ఇందులో వైఎస్సార్టీపీ వైపు నుంచి ఎలాంటి తప్పిదం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. వైఎస్సార్టీపీ వాదనపై స్పందించిన హైకోర్టు.. వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. సీఎం కేసీఆర్ పైన అలాగే మతపరమైన వ్యాఖ్యలు చేయరాదని సూచించింది.
ఇక అంతకుముందు ఈరోజు మధ్యాహ్నం షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు ఆమెను కారుతో సహా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అయితే ఈ క్రమంలో షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ కుమార్తెను పరామర్శించేందుకు బయలుదేరగా ఇంటివద్దే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో విజయమ్మ పోలీసుల వైఖరికి నిరసనగా రోడ్డుపైనే బైఠాయించడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తె షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, పరామర్శకు వెళ్తుంటే వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా విమర్శిస్తే.. సమాధానం చెప్పాలని, లేదంటే ప్రతి విమర్శ చేయాలని, అంతేకానీ దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. తన కుమార్తె దగ్గరకు వెళ్లనివ్వాలని, లేని పక్షంలో తాను వచ్చే వరకూ ఇక్కడే రోడ్డుపైనే కూర్చుంటానని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE