ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ గా కేఎస్ జవహర్ రెడ్డి నియామకం

AP Govt Appointed KS Jawahar Reddy as New Chief Secretary for the State,AP Govt Appointed KS Jawahar Reddy,KS Jawahar Reddy New CS,AP CS KS Jawahar Reddy,AP Chief Secretary,AP New Chief Secretary,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్)‌ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈ రోజు (నవంబర్ 29, మంగళవారం) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న డా.సమీర్‌ శర్మ నవంబర్ 30వ తేదీన పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎస్ గా కేఎస్ జవహర్ రెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి డిసెంబర్ 1న బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

1990 బ్యాచ్‌ కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన జవహర్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రికి స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా ఉన్నారు. అలాగే వైద్యశాఖ ముఖ్య కార్యదర్శిగా, టీటీడీ ఈవోగా, అనేక విభాగాల్లో పనిచేశారు. పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా సీఎస్ రేసులో ఉన్నప్పటికీ, గత కొంతకాలంగా సీఎంవో కీలకంగా ఉన్న జవహర్ రెడ్డి వైపే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొగ్గుచూపుతూ నిర్ణయం తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − five =