హైదరాబాద్ నగరంలో నూతనంగా నిర్మించిన చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్ను తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ శనివారం ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రూట్లో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించడానికి ప్రభుత్వం రూ. 45 కోట్లకు పైగా వ్యయంతో 674 మీటర్ల పొడవుతో ఇరువైపులా నాలుగు లేన్లతో ఈ ఫ్లై ఓవర్ను నిర్మించడం విశేషం. ఇక ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు ప్రయాణం సులభతరం కానుంది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వలన హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. కాగా ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్, డిప్యూటీ మేయర్ శ్రీలత తదితరులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY