తెలంగాణలో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాని విద్యార్థులకు శుభవార్త

Grace marks ruled out for Inter students, Grace Marks to Students who are Not Attended to the Exams, Inter Board Decides Give Grace Marks, telangana, Telangana Inter Board, Telangana Inter Board Decides Give Grace Marks to Students, Telangana Inter Board Latest News, TS Inter, TS Inter 2020

కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ఆమోదంతో ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గత మార్చిలో ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాని 27,589 విద్యార్థుల‌ను గ్రేస్ మార్కుల‌తో పాస్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. 27,589 మందిలో 27251 మంది పరీక్షకు హాజరు కానివారు కాగా, 338 మంది మాల్ ప్రాక్టీస్ క‌మిటీ బ‌హిష్క‌రించిన వారు ఉన్నారు. కరోనా పరిస్థితుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 5 =