భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. నవంబర్ 3, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 82,67,623 కు, మరణాల సంఖ్య 1,23,097 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 38,310 కరోనా పాజిటివ్ కేసులు, 490 కరోనా మరణాలు నమోదయ్యాయి. అలాగే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా 76 లక్షలు దాటింది. ఒకే రోజులో 58,323 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 76,03,121 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 91.96 శాతంగా నమోదైంది. కాగా కరోనా మరణాల రేటు 1.49 శాతంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ప్రస్తుతం 5,41,405 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశంలో నవంబర్ 2 నాటికీ 11,17,89,350 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 10,46,247 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ