తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి గురువారం నాడు విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం మొదటి సంవత్సరం పరీక్షలు మే 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఏప్రిల్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహించనున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను ఏప్రిల్ 1వ తేదీన, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఏప్రిల్ 3వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే టైం టేబుల్ వర్తించనున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్:
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ