తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలను జూన్ 18, గురువారం సాయంత్రం వెల్లడించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. ఫలితాలకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియ అంతా పూర్తీ చేసి ప్రభుత్వానికి తుది నివేదిక అందజేసినట్టు తెలిపారు. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలకు మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, ఇందులో 95.72 శాతం మంది హాజరయినట్టుగా తెలిపారు. కాగా ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/ లో అందుబాటులో ఉంచే అవకాశముంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu