ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగిన టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం

Graduate MLC Elections, Graduate MLC polling, Jana Samithi Chief Kodandaram, Khammam Graduates MLC Elections, Kodandaram to Contest in Graduate MLC Elections, MLC Graduates Elections In Telangana, Professor Kodandaram will contest the MLC election, telangana graduate mlc elections, telangana graduate mlc elections 2020, Telangana Jana Samithi Chief Kodandaram

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానం మరియు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పదవీకాలం ముగియడంతో త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి (టీజేఎస్)‌ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు టీజేఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేశారు. కోదండరాం పోటీపై ముందునుంచి వార్తలు వచ్చినప్పటికీ నేటితో స్పష్టత వచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో కోదండరాంకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలుస్తుందా లేదా అనే అంశం ఇంకా తెలియాల్సి ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ ప్రక్రియ నవంబర్‌ 6 వ తేదీ వరకు కొనసాగనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =