తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పదవీకాలం ముగియడంతో త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు టీజేఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేశారు. కోదండరాం పోటీపై ముందునుంచి వార్తలు వచ్చినప్పటికీ నేటితో స్పష్టత వచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందా లేదా అనే అంశం ఇంకా తెలియాల్సి ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ ప్రక్రియ నవంబర్ 6 వ తేదీ వరకు కొనసాగనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu