త్వరలో జరగనున్న మునుగోడు ఉపఎన్నికలో పోటీచేస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. శుక్రవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ, మునుగోడులో పోటీపై స్పష్టత ఇచ్చారు. మునుగోడు ఉపఎన్నికకు త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని కోదండరామ్ తెలిపారు. ఇక ప్రజాశాంతి పార్టీ తరపున బరిలో ఉంటానని ప్రకటించిన ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ ఉమ్మడి అభ్యర్థిగా నిలబడితే తెలంగాణ జనసమితి కూడా మద్దతు ఇస్తుందని చెప్పారు.
మరోవైపు సీఎం కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి జాతీయపార్టీపై కోదండరామ్ స్పందిస్తూ, అది విఫల ప్రయోగమని, తెలంగాణ అస్తిత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఆలోచించరని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ వాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని , ఆ దిశగా కృషి చేస్తామని కోదండరామ్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY