కేసీఆర్ లాంటి దూరదృష్టి కలిగిన వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో ఈరోజు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో 529 మంది ‘కల్లు గీత’ కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కల్లు గీత కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వారి వృత్తిలో ఉండే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని వారికి ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించామని వెల్లడించారు. ఇంకా ప్రమాదవశాత్తూ గీత కార్మికులు మృతి చెందితే వారి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా అందజేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు.
అలాగే తరతరాలుగా వస్తున్న కులవృత్తులను కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉండే కల్లు గీత కార్మికులకు అందరికీ ప్రభుత్వం లైసెన్సులు ఇస్తోందని, ఈ క్రమంలోనే అందరికీ గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నామని హరీష్ రావు తెలియజేశారు. సిద్దిపేటలో ఎల్లమ్మ దేవాలయం వద్ద రూ. 5 కోట్లతో గౌడ ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నామని, మరో రెండు నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గౌడ కులస్తులకు ప్రత్యేకంగా వైన్ షాపుల్లో రిజర్వేషన్లు, సొసైటీల పునరుద్ధరణ వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు గుర్తు చేశారు. ఇంకా గౌడ కులస్తులకు ప్రత్యేకంగా బడ్జెట్లో వంద కోట్లు కేటాయించామని మంత్రి హరీష్ రావు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF