ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు కొలువుదీరిన హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దేశంలో ఐటీ రంగంలో హైదరాబాద్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెంచేందుకు, మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కొలువుదీరేలా చేసేందుకు మంత్రి కేటీఆర్ చొరవ చూపుతున్నారు. ఈ క్రమంలోనే నేడు అమెరికా పర్యటనకు కేటీఆర్ పయనమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ బహుళజాతి కంపెనీలను సంప్రదించేందుకు మంత్రి కేటీఆర్ అమెరికాకు బయల్దేరుతున్నారు. పది రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో మంత్రి పలు ప్రముఖ కంపెనీలను సందర్శించనున్నారు.
On my way to the United States for a work trip after 5 years. Lots of exciting meetings lined up in west coast and east coast over the course of next week
Looking forward to some hectic activity & travel 😁#Wanderlust
— KTR (@KTRTRS) March 18, 2022
మంత్రి కేటీఆర్ తోపాటు రాష్ట్రం నుంచి ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపూరి, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఇంకా పలువురు అధికారులు వెళ్ళనున్నారు. ఈ బృందం అమెరికాలోని తూర్పు, పశ్చిమ కోస్తా ప్రాంతాల్లో ఈ నెల 29 వరకు పెట్టుబడుల కోసం పర్యటించనుందన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా.. 20న శాండియాగో, 21న శాన్జోస్, 24న బోస్టన్, 25న న్యూయార్క్ రాష్ట్రాలలోని ప్రముఖ కంపెనీలతో సమావేశమవనున్నారు. ఈ క్రమంలో ఆయా సంస్థల సీఈవోలను కలిసి తెలంగాణాలో పెట్టుబడుల కోసం ఆహ్వానించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ