భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం పాలనలో అనేక విధాలుగా విఫలమైందని వ్యాఖ్యానించారు తెలంగాణ ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు. కేంద్రంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ తన ట్విటర్ వార్ కొనసాగిస్తున్నారు. దేశంలో ప్రతి దానిలో తీవ్రమైన కొరత ఉందని, దీనికంతటికీ ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న విజన్ కొరతే అని తాజాగా ఈరోజు మంత్రి కేటీఆర్ ఈ మేరకు తన ట్విట్టర్లో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు.
బీజేపీ పాలనలో *బొగ్గు కొరత*
కరోనా టైంలో *ఆక్సిజన్ కొరత*
పరిశ్రమలకు *కరెంట్ కొరత*
యువతకు *ఉద్యోగాల కొరత*
గ్రామాల్లో *ఉపాధి కొరత*
రాష్ట్రాలకిచ్చే *నిధుల కొరత*అన్ని సమస్యలకు మూలం PM
*మోడీకి విజన్ కొరత*NPA Govt’s amazing performance 👏 pic.twitter.com/N5oMBuVeDF
— KTR (@KTRTRS) May 2, 2022
దేశంలో చాలా రాష్ట్రాల్లో సరిపడినంత విద్యుత్ లేదని, అలాగే ప్రధాన వనరైన బొగ్గు కొరతకు సరైన పరిష్కారం చూపలేకపోయారని విమర్శించారు. దీనివలన పరిశ్రమలు సరిగా నడవక కార్మికులకు ఉపాధి పోతోందని వెల్లడించారు. ఇక కరోనా మహమ్మారి సమయంలో దేశంలో ఆక్సిజన్ కొరతతో తీవ్ర నష్టం వాటిల్లందని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేవని, ఉద్యోగాల కొరత ఉందని తెలిపారు. గ్రామాల్లో ఉపాధి కొరతతో కూలీలు పలు ఇక్కట్లకు గురవుతున్నారని, రాష్ట్రాలకిచ్చే నిధులు కూడా సక్రమంగా విడుదల చేయటం లేదని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ