సుదీర్ఘ కాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న హైదరాబాద్లోని జర్నలిస్టులకు సుప్రీంకోర్ట్ లో ఊరట లభించింది. గతంలో ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల స్వాధీనానికి మరియు నిర్మాణాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్లో ‘ఇంటి స్థలాల కేటాయింపులపై తెలంగాణ జర్నలిస్టు సంఘం దీర్ఘకాలిక డిమాండ్ను క్లియర్ చేసినందుకు గౌరవనీయులైన సుప్రీంకోర్టు & సీజేఐ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది తెలంగాణ ప్రభుత్వం మన జర్నలిస్ట్ స్నేహితులకు మా వాగ్దానాన్ని నెరవేర్చడంలో సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు.
I would like to extend my gratitude to the Hon’ble Supreme Court & CJI Garu for clearing the long-standing demand of Telangana journalist society on house site allotments
This will help Telangana Govt deliver on our promise to our Journalist friends 👍
— KTR (@KTRTRS) August 25, 2022
ఇక కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. అయితే వారికి భూమి కేటాయించారు కానీ అభివృద్ధి చేయలేదు. వారంతా కలిసి ఆ స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి అనుమతిస్తున్నాం, అలాగే వారు ఆ స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చు. రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయానికొచ్చాం అని సీజేఐ తుది తీర్పులో పేర్కొన్నారు. కాగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తన పదవీ విరమణకు ఒక రోజు ముందు ఈ కీలక తీర్పునివ్వడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY