రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పౌల్ట్రీ యూనిట్లు, డెయిరీ యూనిట్లకు ఇంటి పన్నును మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా పౌల్ట్రీ యజమానులు, డెయిరీ యూనిట్ల ఆస్తి పన్నును రద్దు చేయాలని కోరుతున్నారని దయాకర్ రావు గుర్తు చేశారు. వారి వినతిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
దీంతో రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులు, డెయిరీ యూనిట్ లు వారు ఎంతో లబ్ధిపొందుతారని, ఆస్తిపై హక్కు పొందడానికి సంవత్సరానికి వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు. ఈ నిర్ణయం ద్వారా పౌల్ట్రీ, డెయిరీ రంగంలో కొత్త వారు రావడానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ