తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 156 పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 6, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,76,943 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరోకరు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3,787 కి పెరిగింది. కరోనా రికవరీ రేటు 98.85 శాతంకాగా, మరణాల రేటు 0.59 శాతంగా నమోదైంది.
ఇక గత 24 గంటల్లో 147 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 6,69,157 కు చేరుకుంది. ప్రస్తుతం 3,787 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు ఆదివారం నాడు 25,693 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 2,87,64,155 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 7,72,814 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రిస్క్ కంట్రీస్ నుండి 1270 మందిరాగా, 13 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా, ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ