తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2239 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 25, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,83,866 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1091 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.
ఇక కరోనా నుంచి కొత్తగా 2,281 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,52,441 కి చేరింది. ప్రస్తుతం 30,334 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 82.90 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 316, రంగారెడ్డి జిల్లాలో 192, మేడ్చల్ లో 164, నల్గొండలో 141, కరీంనగర్ లో 106, వరంగల్ అర్బన్ లో 91, భద్రాద్రి కొత్తగూడెంలో 91, సిద్దిపేటలో 79, ఖమ్మంలో 73, నిజామాబాద్ లో 69, సంగారెడ్డిలో 66, సూర్యాపేటలో 63, కామారెడ్డిలో 60 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu